Saturday, April 26, 2014

ధ్యానం (Meditation ) page 2

Hello welcome  to ojas meditation

ఇంతకుముందు మనం మనస్సు యొక్క మూడు స్థితులు (state) వాటికీ అనుగుణంగా ధ్యానం లో (3) దశలు ఉన్నాయి అని చెప్పుకొన్నాం - 1. ధారణ   2. ధ్యానం  3. సమాధి

ధారణ (Keeping mind steady, Power of retention ) :  మనస్సు అంతర్ముఖం చేసి ఒక భావన (భగవన్మయమైన) మీద కొద్ది సేపు నిలపగాలిగితే దాన్ని "ధారణ "  అంటారు.  "ధారణ" ఆగకుండా తైలధారగా (oil flow ) కొనసాగితే అది "ధ్యానం" అవుతుంది.  
           సాధారణమైన ఏకాగ్రత అంత తొందరగా ధ్యానం లోకి వెళ్ళదు, దానికి సాధన కావలి. 
          మనస్సును అంతర్ముఖం చేసి ఏదో ఒక భావన మీద మనం మనస్సు ను నిలపటానికి పదే పదే  ప్రయత్నం చెయ్యాలి. ఈ  ప్రయత్నాన్ని "ప్రత్యాహారం" అంటారు.  కొంచెంసేపు కనీసం రెండు మూడు క్షణాలు నిలపగలిగితే  దాన్ని "ధారణ" అంటారు. 
           ఉదాహరణకి నా మనస్సుని ఎదురుగా కనిపిస్తున్న " గ్లాస్ " పై కేంద్రీకరించాను అనుకుందాం, మనస్సు చంచలంగా ఉండి "గ్లాస్" మీద నిలబడదు, నేను మళ్ళా మళ్ళా దాన్ని(మనస్సును)  వెనక్కి తీసుకొచ్చి ఆ "గ్లాస్" పై కేంద్రీకరిస్తాను, అప్పుడు కొంచెం సేపు ఆ గ్లాస్ మీద దృష్టి  మళ్ళి దానిమీద నిలబడుతుంది ఇది  ధారణ
                ఇంక ఆ "గ్లాస్" పైనే మనస్సు దృడంగా ఉండి  అటూ ఇటూ ఎక్కువగా కదలకుండా ఏకాగ్రంగా కొద్ది సేపు ఉంటే దాన్ని "ధ్యానం" అంటారు. 
                 కొంతకాలానికి  "నాకూ  ఆ గ్లాస్ కు " భేదం పూర్తిగా సమసిపోయి "నా మనస్సు గ్లాసు ఏకమై" ఆ రెండింటికి ఏ విధమైన భేదం కనిపించదు, నీ మనస్సు, నీ ఆత్మ , నీ inner consciousness  అంతటా గ్లాస్ అయిపోతుంది.  ఇది "సమాధి" స్ధితి.

                   ధ్యానం అంత సులువైన విషయం కాదు వంటబట్టటానికి.  చాలా సాధన కావలి.  మనస్సును కంట్రోల్ చెయ్యాలి.  మనస్సు చెఱువు లాంటిది.  ఆలోచనలు గాలి లాంటివి.  గాలిని ఆపితే గాని చెఱువు ప్రశాంతంగా ఉండదు. చెఱువు ప్రశాంతంగా  అలలు లేకుండా ఉంటేనేగాని చంద్రబింబం చెఱువు లో కనపడదు.   ఆలోచనలని ఆపి మనస్సును కంట్రోల్ చేస్తేనేగాని మనలోపల "చైతన్య శక్తి " (inner consciousness ) మనకి అవగతం (అనుభవం ) లోకి రాదు. 
             ఒకరకంగా చెప్పాలంటే ధ్యానం చేస్తేనేగాని మనస్సు స్వాధీనం లోకిరాదు - మనస్సును స్వాధీనం చేసుకొంటేనేగాని ధ్యానం కుదరదు.  పిచ్చి కుదిరితేగాని పెళ్లిఅవదు - పెళ్లిఅయితేగాని పిచ్చికుదరదు. 
                   మొట్టమొదట మనందరం మన ఆలోచనలోని తప్పుని గుర్తించాలి -   అదేమిటంటే  " నేను ధ్యానం చేస్తాను " ( I do Meditation ) ఇది  తప్పు -- ధ్యానం - వంటచేయటం, పనిచేయటం లాంటిది కాదు - you can  never  do  meditation ).  ఇది ఒక నిర్దుష్టమైన "సహజస్థితి" (natural quality).  ప్రతి మనిషి లోను ఇది అంతర్గతంగా దాగి ఉంటుంది (natural  quality  built in).    ఈ  సహజస్థితి వికసించటానికి (blossom ) మనం మన శరీరాన్నీ, మనస్సుని, రాగద్వేషాలని, కామక్రోధాలని అన్నింటినీ సంసిద్ధం (preparedness) చేసుకోవాలి. ఉదాహరణకి మన ఇంట్లో కుండిలో మనం పెంచుకొంటున్న గులాబి చెట్టు కి మొగ్గలు వచ్చాయి అనుకుందాం, ఆ రోజు మన ఇంట్లో function ఉందని ఆ మొగ్గల్ని మనం వికసింపచేయలేము కదా.  మనం దానికి నీళ్ళు పోస్తాం, ఎరువు వేస్తాం, ఎండ ఎక్కువ తగలకుండా చూస్తాం - దానికి కావలసిన atmosphere create చేస్తాం. అది దానంతటఅదే వికసిస్తుంది.  అలాగే మన మనస్సును మనం ధ్యానానికి  సమాయుత్తం చెయ్యాలి. అప్పుడు ద్యాన కుసుమాలు మీ లోపల వెల్లివిరుస్తాయి. 
మనలోని ఈ శక్తిని జాగృతం (awaken) చేయగలిగితే, ఇంక మనం చెయ్యలేనిది అంటూ ఏమి ఉండదు.  ఏ విద్యని అభ్యసిస్తావో అందులో ఉత్తమ స్తాయిలో ఉంటావు, ఏ ఉద్యోగం చేస్తావో అందులో ప్రధముడిగా ఉంటావు, ఏ మానవతా విలువలు ఉన్నతమైనవో అవి నీలో ఉంటాయి.  ఏ సమాజ శ్రేయస్సు కై పాటుపడతావో దాన్ని సాధించగలుగుతావు.  ఉత్తముడైన మానవుడిగా మనగలుగుతావు.  

శుక్లయజుర్వేద సంహితలో ఒక ప్రార్ధన శ్లోకం ఉంది - ఎప్పుడైనా ద్యానం కుదరనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు దీన్ని చదువుకొని దీనర్ధం మననం చేసుకొంటే పూర్తిగా ద్యానం లో నిమగ్నం అవుతాం. 
తేజోసి తేజో మయి ధేహి ! వీర్యమసి వీర్యం మయి ధేహి ! 
బలమసి బలం మయి ధేహి ! ఓజోసి ఓజో మయి దేహి !
మనం ధ్యానం లో భగవంతుడిని తలుస్తూ (ఒకవేళ భగవంతుడు వద్దు అనుకుంటే) విశ్వమంతా వ్యాపించిన విశ్వశక్తి ని తలుచుకొని - "నీవు పవిత్రతా స్వరూపుడవు - నన్ను పవిత్రతతో నింపివేయి.  నీవు శక్తి స్వరూపుడవు - నాకు శక్తిని ప్రసాదించు.  నీవు బలవంతుడవు - నాకు బలాన్ని ప్రసాదించు.  నీవు ఓజస్సంపన్నుడవు - నాలో ఓజస్సును నింపు.
ఈ qualities అన్నీ మనం acquire  చేయగలిగితే - మనం పరిపూర్ణ మానవుడిగా వికసిస్తాం.  ఇదే ధ్యానం లో మనకి కలిగే అద్భుత పరిణామం.  

ఇదంతా బాగానే ఉంది అసలు మనసు నిలబడాలికదా ధ్యానం చేయాలంటే  ఇదే ప్రశ్న అర్జునిడికి కూడా వచ్చింది - వెంటనే కృష్ణుడిని అడిగాడు -  ఆయన దగ్గర అన్నిటికి ready made  answers ఉంటాయి కదా -(6-33 to 36)
ప్రశ్న :
 (6-34) చంచలమ్ హి మనః కృష్ణ ప్రమాధి బలవ ధృడమ్! త స్యాహం నిగ్రహం మన్యే వాయో రివ సుదుష్కరం !
ఓ కృష్ణా ! నీవేమో మనోనియంత్రణ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి చెపుతున్నావు.  కానీ నా మనస్సేమో  కల్లోలంగా ఉంది.  దానిని ఏమాత్రం నిగ్రహించలేకుండా ఉన్నాను!
సమాధానం : 
(6-35) అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ! అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే !
నీవు చెప్పేది నిజమే! మనసు కల్లోలంగా ఉన్నా సరే,  సరైన పద్ధతులనవలంబించి దాని ద్వారా మనోనిగ్రహం అలవరుచుకోవచ్చు.  అబ్యాస, వైరాగ్యాల ద్వారా కల్లోలంగా ఉన్న మనస్సుని సైతం, స్వాధీనం చేసుకోవచ్చు. అలా  స్వాధీనం చేసుకొని మనలోని ఆత్మకు మూలమైన పరమాత్మ శక్తి తో అనుసంధానం చేయచ్చు. ఆయనే పద్ధతులు కూడా వివరించారు (6-17) మితంగా భుజిచమని, మితంగా వినోదించమని, పని, నిద్ర, మేలుకొని ఉండటం అన్నిటిలో "అతిని" వదిలేయమని etc. 

ధ్యానం ఎప్పుడు చెయ్యాలి - ఎలా చెయ్యాలి - దానికి కావలసినవేమిటి 
ధ్యానం ఎక్కడ,ఎప్పుడు చెయ్యాలి : 
          ధ్యాన సాధనికి కొచెం ఏకాంతమైన ప్రదేశం ఉంటే బాగుంటుంది.  అలా అని హిమాలయలలోకో, అడవుల్లోకో వెళ్ళమని కాదు ఇంట్లోనే కొంచెం గాలి వచ్చే ప్రదేశం, కాస్త గొడవ తక్కువ ఉన్న ప్రదేశం అయితే చాలు.  కాని రోజూ ఒకే ప్రదేశం లో కూర్చోవటం చాల మంచిది. ఆ చోటికి రాగానే మన మనస్సుకి ధ్యానానికి కూర్చుంటున్నాము అని అర్థం అవుతుంది.
ధ్యాన సమయం :
రోజుకు (4) సార్లు ధ్యానానికి అనువైన సమయాలు
1. వేకువఝాము    -- రాత్రి ముగిసి తెల్లవారుతున్న సమయం -- ఉ. 5 గం. నుంచి 6 గం. వరకు
2. మధ్యహాన్నం     -- ఎండ తీవ్రత లలో మార్పులు చెందుతున్న సమయం -- 11 గం. నుంచి 12 గం. వరకు
3. సాయింత్రం        -- పగలు, రాత్రి అవుతున్న సమయం   -- 5 గం.   నుంచి  6 గం.
4. రాత్రి                 -- ప్రశాంతమైన రాత్రి వేళ                      -- 11 గం. నుంచి  12 గం.
          ఈ సమయాలలో పకృతి ప్రశాంతం గా ఉంటుంది.  అంతే కాకుండా ఏదైతే cosmic  energy  మనచుట్టూ ఆవరించి ఉందొ దాని density levels ఎక్కువగా ఉంటాయి,  అవి  మన ధ్యానం లో  ఆత్మ చైతన్యం గా మారి మనలో శక్తి  పెరగటానికి దోహద పడుతుంది.
           కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు తప్పనిసరిగా వేకువఝామున చెయ్యాలి. పైన చెప్పిన సమయాలలో మీకు వీలయిన సమయాలు కనీసం రెండయినా ఎంచుకోండి.  ఎంతసేపు అంటే పావుగంట నుంచి గంట వరకు మీకు వీలయినంత సమయం.  రాసి కాదు వాసి ముఖ్యం (quality is important not quantity )
            అలాగే ధ్యానం అయిపోయిన వెంటనే లేవకూడదు. ఒక two minutes  కూర్చుని అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని అసలు ఇంతసేపు ధ్యానం లో ఏం జరిగిందో సమీక్షించుకొని లేవాలి.
ఎలా చెయ్యాలి - కావలసినవి ఏమిటి :
         పతంజలి మహర్షి ఒక గ్రంధం వ్రాసారు  అదే " యోగసూత్రాలు"  దాంట్లో రెండో అధ్యాయమైన సాధనాప్రకరణం లో  ధ్యానానికి కావలసిన లక్షణాలు అన్నీ "అష్టాంగయోగం" అని క్రోడీకరించారు.  ఈ   అష్టాంగయోగం లో ఎనిమిది మెట్లు ఉన్నాయి 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధ్యానం 7. ధారణ 8. సమాధి 

ఇందులో 5 నుంచి 8 వరకు అంటే ప్రత్యాహారం నుంచి సమాధి వరకు మనం చర్చించుకున్నాం.  ఇంక యమ,నియమాలంటే మనిషిని మనిషిగా నిలబెట్టేవన్న మాట (శ్రీరామచంద్రుడు లాగ మనం మారాలన్న మాట). ఇవి తరవాత చర్చించుకొందాం.  ఇంక  మిగిలినవి ఆసనం, ప్రాణాయామం.
ఆసనం :
ఏ భంగిమలో ఎలా కూర్చున్నా స్థిరం గాను, ఇబ్బంది లేకుండాను కూర్చోవాలి. వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇబ్బంది లేకపోతే పద్మాసనం/ సుఖాసనం లో క్రింద కూర్చోండి.  లేదా కుర్చీ లో కూర్చోండి మీ ఇష్టం - కాని రోజు అదే place లో కూర్చోవాలి.  పడుకోని  చేయచ్చా  అంటారా - భేషుగ్గా చేయచ్చు - నిద్ర రాకుండా చూసుకోండి.
ప్రాణాయామం :
            ప్రాణాయామం అంటే గాలిని లోపలి తీసుకోని - కొంచెంసేపు ఊపిరితిత్తులలొ ఉంచి - తిరిగి వదలటం - ఇది 1 : 4 : 2 నిష్పత్తి లో చేయాలి.  ఇది పెద్ద subject  తరవాత చెప్పుకొందాం.
శ్వాస :
          మనకి ధ్యానం లో  శ్వాస చాలా ముఖ్యమైనది .  మనస్సు కు శ్వాసకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండూ ఒకదాని మీద ఒకటి పని చేస్తాయి. సమాన వ్యవధులలో చేసే ఉచ్చ్వాస - నిశ్వాసాలు (inhale & exhale ) మన ధ్యానం లో ధ్యేయ విషయం గా (concentration point ) పరిగణించాలి.   గాలిని లోపలి తీసుకొంటూ విశ్వం లోని తేజస్సు(energy ) లోపలి తీసుకొంటునట్లు feel అవండి. రెండుకనుబోమల మధ్య ఆజ్ఞాచక్రం (వీటిగురించి యోగా లో చెపుతాను) దగ్గర లోపలి తీసుకొన్న గాలి ఆగినట్టు feel  అవండి. మళ్ళా శ్వాసను వదులుతూ మీ ప్రేమపూరితమైన పవిత్రమైన చైతన్య ప్రవాహాలను అన్ని వైపులకి పంపుతున్నట్టు అందరు సుఖ శాంతులతో ఉండాలని అనుభూతి చెందండి.  ఈ  విధంగా చేయటం వల్ల మీలో energy levels ఉన్నతస్థాయిలకి చేరటం ఎంతో  సులువు అవుతుంది .

దేన్నీ ధ్యానించాలి :
మీ ఇష్టం.  మీ ఇస్ట దైవం ని ధ్యానించండి. లేదా విశ్వమంతా వ్యాపించిన ఒక మహా కాంతిపుంజం లో ప్రేమ, పరమానందం నిండి ఉన్నాయని ఉహించండి. ఆ కాంతిపుంజం లో మీలోని ఆత్మ ఉందని ఊహించండి.  మీ ఆత్మ తేజం తో మీ హృదయం నిండిపోయింది - క్రమంగా ఆ దివ్య కాంతి మీ శరీరాన్ని, మనస్సును లోపల, బయటా కప్పివేస్తున్నట్టు భావించండి.  ఆ తరవాత సృష్టి మొత్తం లోని అన్నిచోట్లా ప్రకాశిస్తున్న ఒక అనంతమైన తెజోరాశిలో మీలోని తేజం ఒక భాగం అని అనుభూతి చెందండి.   చివరగా మీరొక చిన్న కాంతి గోళంగా మారి ఆ తెజోరాసిలో ప్రకాసిస్తున్నట్లు ఊహించండి.
          ఇలాంటి ఆనందాన్ని పొందలే గాని చదివితే రాదు కదా. జిలేబి తింటేనే కదా రుచి తెలిసేది.
         ప్రయత్నం మొదలు పెట్టండి జిలేబి తినటానికి.  పిండితెవాలి, నానబెట్టాలి, బట్టకి కాజా కుట్టాలి చాలా ఉన్నాయి కదా.  ఎందుకు పుల్లారెడ్డి ఉన్నాడంటారా  - అప్పుడైనా బయటికి వెళ్ళే డ్రెస్ వేసుకోవాలి, బండి తీయాలి, డబ్బులున్నాయో లేదో చూడాలి  -- వగైరా.
next week మరిన్ని విశేషాలతో
మీ రాజేశ్వరి